మహేశ్వరం: నవ వధువు అదృశ్యం

78చూసినవారు
మహేశ్వరం: నవ వధువు అదృశ్యం
నవ వధువు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జల్ పల్లికి చెందిన యంజాల పెద్దిరాజ్ వివాహం ఏడు నెలల క్రితం అర్చనతో జరిగింది. పెళ్లైన మూడు నెలల వరకు వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగినది. అనంతరం ఆమె భర్తను దూరం పెడుతూ వచ్చింది. ఈ నెల 1న ఇంట్లో ఎవరూ లేని సమయంలో బంగారు నగలు, దుస్తులు తీసుకొని వెళ్లిపోయింది. భర్త పిర్యాదు చేయగా పోలీసులు కేసు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్