మల్కాజ్ గిరిలోని జ్యోతీ నగర్ పార్కులో రజక సంఘాలు ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని రాత్రికి రాత్రే గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి నుంచి తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న రజక సంఘాలు పార్కు వద్దకు వచ్చి గురువారం ఆందోళన చేపట్టారు. కొన్ని రోజుల క్రితమే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.