గత ఎన్నికల్లో తమకు కేటీఆర్ కొన్ని సూచనలు చెప్పారని, ఇప్పుడు ఆ సూచనలే పాటిస్తూ కాంగ్రెస్ ను గెలిపిద్దామని కాంగ్రెస్ మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డి సోమవారం అన్నారు. తూంకుంటలో ఆమె మాట్లాడుతూ. మా పార్టీకి ఓటేయాలని ఓటర్ల వద్దకు మొదటిసారి పోతే చూస్తామంటారని, రెండోసారి పోతే వేస్తామంటారని, మూడోసారి పోతే మీకే ఓటేస్తామని చెబుతారని, ఈవిషయం కేటీఆర్ చెప్పారని సునీతరెడ్డి అన్నారు.