జోరుగా ఎకో ఫ్రెండ్లీ బొజ్జ గణపతుల విక్రయం

64చూసినవారు
జోరుగా ఎకో ఫ్రెండ్లీ బొజ్జ గణపతుల విక్రయం
మేడ్చల్ ప్రాంతంలోని ప్రధాన రహదారి పక్కన శ్రీనివాసరావు, నారాయణ, చంద్రమౌళి కళాకారుల ఆధ్వర్యంలో తయారుచేసిన ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే రేట్లు కాస్త ఎక్కువగా ఉన్నట్లు కొనుగోలుదారులు తెలిపారు. గణపతి ఉత్సవ వేడుకల సమయం దగ్గర పడుతున్న వేళ, హైదరాబాద్ నగర శివారు నుంచి ఇతర జిల్లాల వారు సైతం నగరానికి చేరి గణపతి విగ్రహాలను విక్రయిస్తున్నారు.

సంబంధిత పోస్ట్