చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపదేవి ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సతీమణి మరణంతో విషాదంలో ఉన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా రూపదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే వివేకానంద్ తదితరులు పాల్గొన్నారు.