చిక్కడపల్లి లైబ్రరీలో తీవ్ర ఉద్రిక్తత

81చూసినవారు
చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సోమవారం సాయంత్రం గ్రూపు 2, 3 పోస్టులను పెంచాలని, గ్రూపు 2ను డిసెంబర్ లో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు లైబ్రరీ గేట్ కు తాళం వేసి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమపై లాఠీ ఛార్జ్ చేశారంటూ పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్