గాంధీ భవన్ లో కాంగ్రెస్ నాయకుల నిరసన

55చూసినవారు
బీజేపీ నాయకుడు తన్విందర్ సింగ్, రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ 'మీ నాన్నమ్మకు పట్టిన గతే నీకు పడుతుంది' ఆని మాట్లాడిన మాటలకు ఏఐసీసీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, డిసిసి అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి, విహెచ్. మెట్టు సాయి, పల్లా నరసింహ రెడ్డి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్