కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ మెట్ కాని గూడ రాజీవ్ గాంధీ నగర్ లోని బంగారు మైసమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలకు మంగళవారం ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి దీవెనలతో పిల్లలు ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలన్నారు.