కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సచివాలయం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో అవస్థలు పడుతున్న రైతన్నలను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సచివాలయంలో వారి చాంబర్లో కలిసి బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని పంటలను రూ. 500 బోనస్తో కొనుగోలు చేయాలని సీఎస్కు బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు.