కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జీడిమెట్ల డివిజన్ వినాయక నగర్ నందు బిఆర్ఎస్ యువ నాయకులు నదీమ్ రాయ్ ఆధ్వర్యంలో మంగళవారం బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ గెలుపు ఆవశ్యకతను ఓటర్లకు వివరించారు. అభివృద్ధి సంక్షేమానికి స్వర్ణ యుగంగా బిఆర్ఎస్ పదేళ్ల పాలనను చూసామని వారు అన్నారు.