బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి దర్శనానికి పోటెత్తిన భక్తులు

74చూసినవారు
బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు తమ మొక్కులను అమ్మవారికి చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్