రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలోని నల్లగుట్ట, కరీం కాంపౌండ్ బస్తీలకు చెందిన ముస్లిం సోదరులు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను శనివారం కలిశారు. ఈనెల 17న మొహర్రం పండగ ఏర్పాట్ల కోసం వినతి పత్రాన్ని అందించారు. ప్రధానంగా వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. సంబంధిత అధికారులను స్ట్రీట్ లైట్లని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.