బేగంపేట: ప్రజాభవన్ ముందు నిరసన

70చూసినవారు
ప్రజాభవన్ వద్ద 100 మందికి పైగా జూనియర్ లెక్చరర్స్ అభ్యర్థులు నిరసన తెలిపారు. డీఎస్సీ ఫలితాలతో పాటు జూనియర్ లెక్చరర్స్ ఫలితాలు విడుదల చేయాలని, ఫలితాలు విడుదల చేసి నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజాభవన్ ముందే బతుకమ్మ ఆడుతూ నిరసన తెలుపుతామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్