మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటుతోనే తగిన గుణపాఠం చెప్పాలని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మేల్యే అభ్యర్థి నివేదిత పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ అభివృద్ది బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. శుక్రవారం రసూల్ పురాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు.