రాంగోపాల్ పేట్ లో పర్యటించిన కిషన్ రెడ్డి

70చూసినవారు
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని కలాసిగూడ సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్థానికులతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సుచిత్ర, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్