మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ మరణించడం చాలా బాధాకరమని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. విషయం తెలుసుకున్న ఆయన సోమవారం వెంటనే వారి నివాసానికి చేరుకొని పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.