ఓ కిలాడీ లేడీ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. చిలకలగూడ పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్ పద్మారావునగర్ వాసి దక్షిణామూర్తి (61) అనే ప్రైవేట్ ఎంప్లాయి రేతిఫైల్ బస్టాండ్ లో పరిచయం చేసుకున్న ఓ కిలాడీ లేడీ పలుమార్లు బెదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులను గుంజుతోంది. బాధితుడి ఫిర్యాదుతో నిందితురాలు అరుణపై బుధవారం కేసు నమోదు చేసి, నోటీసులు అందజేశారు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.