ముత్యాలమ్మ ఆలయాన్ని పరిశీలించిన ఎంపీ ఈటెల

70చూసినవారు
సికింద్రబాద్ కుమ్మరిగూడ లోని శ్రీ ముత్యాలమ్మ ఆలయాన్ని మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ శుక్రవారం పరిశీలించారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడి కేసు వివరాలను ఏసిపి సర్ధార్ సింగ్, స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు అయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు ఆయనను కలిసి నిందితుడికి కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్