గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థినులు మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. విద్యార్థినిలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే సంకల్పంతో కిషన్ రెడ్డి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ప్రభుత్వ బడులను అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు. పిల్లలను సర్కారు బడిబాట పట్టించారు. పలు పాఠశాలలో తాగునీటి సౌకర్యం, డైనింగ్ హాల్స్ నిర్మించడంతో పాటు అవసరమైన చోట అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబ్స్, నోట్ బుక్స్, గ్రంథాలయాలను ఏర్పాటు చేసి గుణాత్మక విద్య వైపు అడుగులు వేసేలా కృషి చేశారు.