పంచాయతీలకు రూ. 7.48 కోట్ల నిధులు విడుదల

66చూసినవారు
పంచాయతీలకు రూ. 7.48 కోట్ల నిధులు విడుదల
గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిందని రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌ మోహన్‌ శనివారం తెలిపారు. జిల్లాకు రూ. 7,48,71,805 విడుదలైనట్లు వివరించారు. 3,116 పంచాయతీ సిబ్బందికి రూ. 2,13,67,987 నిధులు విడుదలైనట్లు పేర్కొన్నారు. నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న 10 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్‌ లోన్‌, బ్యాంకు రుణాలు, బకాయి కిస్తీలు చెల్లించేందుకు రూ. 3,11,707 విడుదల చేసినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్