ఫీజుల నియంత్రణ కమిటీ సరిగ్గా పని చేయకపోవడం వలన ఇంజినీరింగ్ కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని బిఆర్ఎస్ వి రాష్ట్ర కార్యదర్శి జీడి అనిల్ కుమార్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీడి అనిల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను దొచుకుంటున్నాయి. ఫీజుల నియంత్రణ కమిటీ నియంత్రణా లోపం వలన ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు.