రైతులకు ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో పత్తి కొనుగోళ్లపై సంబంధిత శాఖల అధికారులు, పత్తి మిల్లర్లతో కలెక్టర్ ప్రతీక్ జైన్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం గ్రేడ్ 1కు మద్దతు ధర రూ. 7521, గ్రేడ్-2కు రూ. 7121 క్వింటాకు మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు.