దూద్ బౌలిలో హైదరాబాద్ ఎంపీ పాదయాత్ర

77చూసినవారు
దూద్ బౌలి డివిజన్ పరిధిలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం పాదయాత్ర నిర్వహించారు. డివిజన్ పరిధిలోని నజీర్ అలీ మసీదులో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక జుమ్మా ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం స్థానికంగా పర్యటించి రానున్న ఎంపీ ఎన్నికల్లో ఎంఐఎం కు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ మూబిన్, స్థానిక ఎంఐఎం కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్