తన తల్లి శోభ కోరిక మేరకు నటుడు విజయ్ దేవాలయం కట్టించారంటూ జోరుగా ప్రచారం సాగింది. దీనిపై శోభ తాజాగా స్పందించారు. ‘‘సాయిబాబా మందిరం నిర్మించాలని నాకు ఎప్పటినుంచో కోరిక ఉండేది. ఈ విషయాన్ని విజయ్తో ఎన్నోసార్లు పంచుకున్నా. నా ఇష్టాన్ని అర్థం చేసుకుని కొంతకాలం క్రితం దీనిని నిర్మించాడు. ప్రతీ గురువారం నేను ఇక్కడికి వస్తుంటా. స్వామి వారిని దర్శించుకుంటుంటా.‘’ అని ఆమె చెప్పారు.