వరద నీటితో వచ్చిన మట్టి వెంటనే తొలగించాలి
గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి డివిజన్ లోని వివిధ కాలనీలో జిహెచ్ఎంసి శానిటేషన్ అధికారులతో పర్యటించడం జరిగింది. కురిసిన భారీ వర్షానికి కాలనీలో వరద నీటితో వచ్చినటువంటి మట్టి రోడ్డుపై నిలవడంతో కాలనీ వాసులకి, వాహనదారులకు ప్రమాదకరంగా ఉందని వెంటనే ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి జి. హెచ్. ఎం. సి అధికారులతో మాట్లాడి రోడ్డుపై నిలిచిన మట్టిని తొలగించడం జరిగింది.