సివరేజీ లైన్ పనులు చేశారు.. రోడ్డు మరమ్మత్తు పనులు మరిచారు

85చూసినవారు
సంతోష్ నగర్ డివిజన్ పరిధిలోని లక్కీ హోటల్ వద్ద 5 నెలల క్రితం సివరేజీ లైన్ పనుల కోసం రోడ్డుని తవ్వారు. సివరేజీ లైన్ పనులు పూర్తి చేసి రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టకపోవడంతో స్థానిక కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని, సంబంధిత అధికారులు, సిబ్బంది స్పందించి నూతనంగా సీసీ రోడ్డు పనులు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్