చంచల్ గూడ జైలుకు కేటీఆర్
చేయని తప్పుకు క్రీశాంక్ ను జైల్లో వేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. బుధవారం కేటీఆర్ హైదరాబాద్ చంచల్ గూడ జైల్లో మన్నె క్రిశాంక్ ను కలిసిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. క్రిశాంక్ పై ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.