TG: ప్రభుత్వం హైడ్రా ద్వారా చెరువులు, నాలాలు రక్షిస్తోందని కాంగ్రెస్ కిసాన్ సెల్ నేత కోదండరెడ్డి తెలిపారు. విభజనకు ముందే 2030 వరకు కాంగ్రెస్ మాస్టర్ప్లాన్ రూపొందించిందని వెల్లడించారు. తాగునీటి అవసరాల కోసం చెరువుల పరిరక్షణకు మాస్టర్ప్లాన్ను సిద్ధం చేసినట్లు వివరించారు. గత ప్రభుత్వం అక్రమ నిర్మాణాలకు మద్దతిచ్చిందని ఆరోపించారు.