ఘోర ప్రమాదం.. 8 కార్లు, రెండు బస్సులు, 4 లారీలు ధ్వంసం (వీడియో)

55చూసినవారు
బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 కార్లు, రెండు బస్సులు, 4 లారీలు ధ్వంసమయ్యాయి. ఒకరు స్పాట్‌లోనే మరణించగా, మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. బెంగళూరు-క్రిష్ణగిరి మార్గంలోని హోసూరు సమీపంలో పేరండ్లపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. గ్రానైట్ లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందు వెళ్తున్న కారును ఢీకొంది. దీంతో వెనుక వస్తున్న వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్