సుహాస్ హీరోగా ఇటీవల విడుదలైన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు చిత్రం వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమాలో ఫిదా ఫేమ్ నటి శరణ్య మరో ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. సినిమాలో ఎంతో కీలకమైన సీన్లో ఆమె నగ్నంగా నటించి అందరికి షాకిచ్చింది. ఈ సీన్ గురించి శరణ్య తాజాగా స్పందించింది. 'డైరెక్టర్ చెప్పగానే కాస్త భయం వేసింది. కానీ నా భయాన్ని పోగొట్టి సపోర్ట్గా నిలిచింది మాత్రం నా భర్త, చిత్ర యూనిట్' అని చెప్పుకొచ్చిది.