ఇంధనం లేక మార్గమధ్యలోనే ఆగిపోయిన పోలీసు వాహనాన్ని నిందితులు నెట్టారు. ఈ ఘటన బిహార్లోని భాగల్పూర్ జిల్లాలో జరిగింది. నలుగురు వ్యక్తులు మద్యం సేవించి పోలీసులకు పట్టుబడ్డారు. దాంతో ఆ నిందితులను పోలీసు వాహనంలో కోర్టుకు తరలించారు. కచాహరి చౌక్ సమీపంలో ఇంధనం లేక వాహనం ఆగిపోయింది. దాంతో ఆ నలుగురి చేతులకు తాళ్లు కట్టి వాహనాన్ని నెట్టించారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో పోలీసుల తీరుపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి.