టీడీపీ, జనసేన సీట్ల కేటాయింపుపై స్పష్టత

248467చూసినవారు
టీడీపీ, జనసేన సీట్ల కేటాయింపుపై స్పష్టత
టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మావేశం ముగిసింది. ఆదివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీలో రానున్న ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చ‌ర్చించారు. రాజానగరం, రాజోలు స్థానాల్లో తాము పోటీ చేస్తున్నట్లు ఇటీవల పవన్‌ ప్రకటించగా.. మిగతా స్థానాలపై బాబు, పవన్ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి జనసేనలో చేరనున్న బాలశౌరి మచిలీపట్నం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్