కర్ణాటక దేవనాగరిలోని SBI బ్యాంకు దోపిడి కేసును పోలీసులు ఛేదించారు. ఈ దోపిడి 2024 అక్టోబర్లో జరిగింది. తమిళనాడుకు చెందిన విజయ్కుమార్ అనే వ్యక్తి లోన్ కోసం బ్యాంకుకు వెళ్లగా.. కొన్ని కారణాలతో బ్యాంక్ లోన్ నిరాకరించింది. దీంతో విజయ్ ‘మనీ హెయిస్ట్’ అనే సినిమా చూసి బ్యాంకులోని రూ.13 కోట్ల విలువైన 17 కేజీల బంగారాన్ని చోరీ చేశాడు. ఈ డబ్బంతా తమిళనాడులోని ఓ బావిలో దాచిపెట్టారు. ఆరుగురు అరెస్ట్ అయ్యారు.