తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేసిన ఐఎండీ

52చూసినవారు
తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేసిన ఐఎండీ
ఉపరితల ఆవర్తనం వల్ల తెలంగాణలో నేటి నుంచి రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. మరోవైపు ఏపీలో ఎండతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

సంబంధిత పోస్ట్