AP: ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 11 మంది గుంటూరు పోలీసులకు ఆ శాఖ ఉన్నతాధికారులు షాకిచ్చారు. అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కోర్టులో హాజరుపర్చే వరకు పలుమార్లు మాజీ ఎంపీ మాధవ్ నిబంధనలను ఉల్లంఘించినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని 11 మందిని సస్పెండ్ చేశారు. జీజిహెచ్ ఆసుపత్రిలో మాధవ్ ఫోన్ మాట్లాడడంతో పాటు కోర్టు ఆవరణలో హంగామా చేయడంతో పోలీసులపై వేటువేసినట్లు తెలుస్తోంది.