అదానీ గ్రూప్లో ప్రభుత్వరంగ బీమా సంస్థ LIC పెట్టుబడులు పెట్టింది. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో 59 శాతం పుంజుకుంది. అదానీ సంస్థల్లో LIC పెట్టుబడుల విలువ 2023 మార్చి 31 నాటికి రూ.38,471 కోట్లుగా ఉండగా.. 2024 మార్చి 31 నాటికి రూ.61,210 కోట్లకు పెరిగాయి. కాగా, హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో LIC నిర్ణయంపై అనేక అనుమానాలుండగా.. అనంతరం అవన్నీ పటాపంచలు అయిపోయాయి.