పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియెర్రా లియెన్లో కొత్త రకం డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. ‘కుష్’ అనే డ్రగ్స్ను అక్కడి యువత సేవించి మత్తులో ఊగిపోతున్నారు. ఈ మత్తు పదార్థాన్ని మనుషుల ఎముకలతో తయారు చేస్తున్నారు. ఈ డ్రగ్స్కు భారీ డిమాండ్ ఉండటంతో కొందరు సమాధులు తవ్వి ఆస్థిపంజరాలను దొంగలిస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు స్వయంగా ఈ విషయాన్ని తెలుపుతూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.