మణిపూర్లో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. తాజాగా కాంగ్కోప్కి ప్రాంతంలోని సదర్లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. లుంకిన్ (22), లఫింగ్ (22) అనే ఇద్దరు గిరిజన యువకులను మైతేయీ తెగకు చెందిన వ్యక్తులు పట్టుకున్నారు. అనంతరం వారిని చిత్రహింసలకు గురి చేసి దారుణంగా హత్య చేశారు. ఇది కూడా వారికి సంతృప్తినివ్వకపోవడంతో మృతదేహాన్ని పలు భాగాలుగా కోసి వీడియో కూడా తీశారు.