శ్రీరామ నవమి వేళ అయోధ్యకు 1,11,111 కిలోల లడ్డూలు

61చూసినవారు
శ్రీరామ నవమి వేళ అయోధ్యకు 1,11,111 కిలోల లడ్డూలు
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత తొలిసారి శ్రీరామ నవమి వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 1,11,111 కిలోల లడ్డూలను రామాలయానికి పంపనున్నట్లు యూపీలోని మీర్జాపూర్‌లో ఉన్న దేవ్‌రహ హాన్స్ బాబా ట్రస్టు వెల్లడించింది. కాశీ విశ్వనాథ్, టీటీడీ వంటి ఆలయాలకు ప్రతి వారం తాము లడ్డూలను పంపుతామని ట్రస్టీ అతుల్ కుమార్ వెల్లడించారు. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు 40వేల కిలోల లడ్డూ ప్రసాదం పంపినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్