టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ కంపెనీలకు యూజర్లు పెరుగుతున్నారు. మే నెల చివరినాటికి ఈ రెండు సంస్థల నెట్వర్క్ను 34.4 లక్షల మంది ఎంచుకున్నారు. వొడాఫోన్ ఐడియా మాత్రం కస్టమర్లను కోల్పోతోంది. ట్రాయ్ తాజా నివేదిక ప్రకారం.. జియోకు కొత్తగా 21.9 లక్షల మంది చేరగా మొత్తం సబ్స్క్రైబర్లు 47.46 కోట్లకు చేరుకున్నారు. ఎయిర్టెల్కు 12.5 లక్షల మంది చేరారు.