ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహిద్ హృదోయ్ సెంచరీ చేశాడు. పీకల్లోతు కష్టాల్లో పడిన బంగ్లా జట్టుకు వెన్నుదన్నుగా నిలిచాడు. హృదోయ్ 114 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 100* పరుగులు సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో సెంచరీ సాధించిన మూడో బ్యాటర్గా హృదోయ్ నిలిచాడు. ప్రస్తుతం బంగ్లా స్కోర్ 228/9 గా ఉంది.