లోక్సభ ఎన్నికల మూడో దశ నేపథ్యంలో బిహార్కు ఆనుకుని ఉన్న నేపాల్ సరిహద్దును మూడు రోజులపాటు మూసివేశారు. సరిహద్దు ప్రాంతాలైన మధుబని, ఖుటోనా, జయనగర్ నుంచి నేపాల్ మీదుగా వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. 7వ తేదీన బీహార్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సరిహద్దులను మూసి వేశారు. మరోవైపు సరిహద్దు వద్ద భద్రతా బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు.