VIDEO: వాటర్ ట్యాంక్ ఎక్కి పెట్రోల్ బాటిళ్లతో రేషన్ డీలర్ల నిరసన

52చూసినవారు
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా సాయినగర్‌లో వాటర్ ట్యాంక్‌ ఎక్కి రేషన్ డీలర్లు పెట్రోల్ బాటిళ్లతో నిరసనకు దిగారు. రాత్రికే రాత్రే రేషన్ షాపులు కొత్తవారికి కేటాయించారని ఆందోళన చేపట్టారు. రేషన్ డీలర్ పోస్టులను అమ్ముకున్నారని ఆరోపణ చేశారు. రేషన్ షాపుల కేటాయింపు కోసం జారీ చేసిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్ అభ్యర్థులకు సర్దిచెప్పేందుకు పోలీసుల ప్రయత్నించారు.

సంబంధిత పోస్ట్