బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన భారత సంపన్న మహిళ సావిత్రి జిందాల్

77చూసినవారు
బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన భారత సంపన్న మహిళ సావిత్రి జిందాల్
భారత్ లో అత్యంత సంపన్న మహిళ, బీజేపీ నాయకురాలు సావిత్రి జిందాల్ హర్యానాలోని హిసార్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన ఎన్నికల నామినేషన్ ను దాఖలు చేశారు. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు సేవ చేసేందుకు తనకొక అవకాశం కావాలని, ఈ ఎన్నికలే నాకు చివరివని ఆమె వెల్లడించారు. అయితే, హిసార్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కమల్ గుప్తాను ఆ పార్టీ బరిలోకి దింపింది.

సంబంధిత పోస్ట్