రెండో టీ20లో బంగ్లాపై భారత్ ఘన విజయం

63చూసినవారు
రెండో టీ20లో బంగ్లాపై భారత్ ఘన విజయం
ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 రన్స్‌ చేసింది. మహ్మదుల్లా (41) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో నితీశ్‌ 2, చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టారు. దీంతో ఒక మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో భారత్ ఈ సిరీస్‌ను కైవసం చేసుకుంది.

సంబంధిత పోస్ట్