సముద్రంలో వెళుతున్న నౌకలను దోచుకునేందుకు ప్రయత్నించిన సముద్రపు దొంగలను భారత నేవీ అడ్డుకుంది. ఈ విషయాన్ని నేవి ఎక్స్లో తెలిపింది. గతేడాది డిసెంబర్లో ex-MV Ruen నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేసి.. ఇతర దేశాల నౌకలను దోచుకునేందుకు దానిని ఉపయోగిస్తున్నారని గుర్తించింది. ఈ క్రమంలోనే ఆ షిప్ను అడ్డగించింది. ఆత్మరక్షణ, దోపిడికి వ్యతిరేకంగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం వారిపై చర్యలు తీసుకున్నామని చెప్పింది.