లోక్సభ ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడో దఫాలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం 2028 వరకు అమలవుతుందని.. దీంతో దాదాపు 81 కోట్ల మందికి ఉచిత సేవలు అందుతాయని సమాచారం. పీఎంజీకేఏవై విస్తరణకు గతేడాది నవంబర్లో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.