టీ20 ప్రపంచకప్ కోసం కొందరు టీమిండియా ఆటగాళ్లు ఇవాళ అమెరికా వెళ్లనున్నారు. తొలి బ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, సూర్య, అర్ష్దీప్ తదితరులు ముంబై నుంచి విమానం ఎక్కనున్నారు. రెండో బ్యాచ్లో యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్, రింకూ సింగ్ నిష్క్రమించనున్నారు. హార్దిక్ పాండ్యా లండన్లో ఉండడంతో అక్కడి నుంచి నేరుగా అమెరికా విమానం ఎక్కనున్నారు.