టీమిండియా స్టార్ బౌలర్ స్నేహ్ రాణా తన బౌలింగ్తో మరోసారి అద్భుతం చేసింది. దక్షిణాఫ్రికాతో ఆడుతున్న టెస్ట్ సిరీస్లో భాగంగా ఒకే మ్యాచ్లో 10 వికెట్లు తీసి సత్తా చాటింది. టెస్టుల్లో ఒకే మ్యాచ్లో 10 వికెట్లు తీసిన టీమిండియా రెండో క్రీడాకారిణిగా స్నేహ్ రాణా నిలిచింది. ఈ మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది.