నేపాల్ అడవిలో తప్పిపోయిన భారతీయులను 10 గంటల తర్వాత రక్షించారు

58చూసినవారు
నేపాల్ అడవిలో తప్పిపోయిన భారతీయులను 10 గంటల తర్వాత రక్షించారు
నేపాల్‌ అడవిలో చిక్కుకుపోయిన ముగ్గురు భారతీయులు సురక్షితంగా బయటపడ్డారు. నితిన్ తివారీ, రష్మీ తివారీ, తనీష్ తివారీ అనే 30 నుంచి 40 ఏళ్ల వయసు గల భారతీయులు, వారి గైడ్ శనివారం నేపాల్ అడవిలో పర్యటిస్తుండగా తప్పిపోయారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో దారి తప్పిపోయిన వారిని 10 గంటల తర్వాత ఆదివారం నేపాల్‌లోని నాగర్‌కోట్ అడవి నుంచి సురక్షితంగా రక్షించినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం వారు ఖాట్మండుకు చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్